బాలకృష్ణ నర్తనశాల 'ఫస్ట్ లుక్' - TeluguCircle-Trending News

Breaking

Tuesday

బాలకృష్ణ నర్తనశాల 'ఫస్ట్ లుక్'

 



తన తండ్రి తెలుగు వారి అభిమాన నటుడు నందమూరి తారక రామారావు గారి బాటలో పయనిస్తూ సాంఘిక, పౌరాణిక , జానపద, చారిత్రిక చిత్రాలతో అలరిస్తున్న నట సింహ బాలకృష్ణ. ఆయన స్వీయ దర్శకత్వంలో పౌరాణిక చిత్రం ' నర్తనశాల' ను ప్రారంభించి కొంతకాలం షూటింగ్ అయ్యాక ... అందులో ద్రౌపది గా నటించిన సౌందర్య విమాన ప్రమాదంలో  అకాల మరణం చెందడం వలన సినిమా షూటింగ్ ఆగిపోయింది. 

AD అమెజాన్ గ్రాండ్ ఇండియన్ ఫెస్టివల్ ఆఫర్ 80% ఆఫ్ సేల్   

అప్పుడు షూట్ చేసిన కొన్ని సన్నివేశాలలో 17 నిముషాల నిడివి గల సన్నివేశాలను ప్రేక్షకులు చూడడానికి వీలుగా ఈ దసరా సందర్భంగా ఈ నెల 24న విడుదల చేస్తున్నారు. ఇందులో అర్జునుడిగా బాలకృష్ణ, ద్రౌపది గా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మ రాజుగా శరత్ బాబు నటించారు. ఈరోజు అర్జునుడి పాత్రలో ఉన్న బాలకృష్ణ లుక్ ను సినిమా ఫస్ట్ లుగా రిలీజ్ చేశారు. ఈ సినిమా ద్వారా వసూలైన మొత్తంలో కొంత భాగం చారిటీస్ కి ఉపయోగించడానికి బాలకృష్ణ గారు సంకల్పించారు. 

No comments: